తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కిషన్ రెడ్డి నియమించడం వెనక కేసీఆర్ పాత్ర ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తమిళనాడు ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు సమకూరుస్తున్నారన్నారు. తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులను తమిళనాడులో పెట్టి బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు.టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం బహిరంగంగానే బయటపెడుతున్నారన్నారు. తెలంగాణ నిఘా అధికారులను తమిళనాడులో పెట్టారన్న అంశంపై విచారణ జరపాలన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఎంపీ అరవింద్ ఆటలో అరటిపండు లాంటివారన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న బండి సంజయ్ ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయించలేకపోయారన్నారు. మోడీ – కేసీఆర్ దోస్తీ ఉందనే కేసులు బయటికి రావడం లేదన్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణకు సంపూర్ణ అన్యాయం జరుగుతోందన్నారు రేవంత్.
see more news