
ఖమ్మం టౌన్, వెలుగు : తన తల్లిదండ్రులు నారాయణ, వెంకట నర్సమ్మ ల జ్ఞాపకార్థం ఖమ్మం సిటీలోని వర్తక సంఘ భవనంలో ఆదివారం షాటో కాన్ స్పోర్ట్స్ కరాటే, డూ అకాడెమీ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన నేషనల్ ఛాంపియన్ షిప్–2025 కరాటే పోటీలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు. తొలుత తల్లిదండ్రుల ఫొటోలకు ఆయనపూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఆటలు శారీరక దృఢత్వానికి, మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు.
విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్జి కె.మురళి మోహన్, సినీ నటుడు రణధీర్, నిర్మాత తాజ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, జల్లెల శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకుడు తోట వీరభద్రం పాల్గొన్నారు.