మిడ్జిల్ ఎంపీపీపై అవిశ్వాస నోటీసులు

మిడ్జిల్ ఎంపీపీపై అవిశ్వాస నోటీసులు
  • కాంగ్రెస్​లో చేరినముగ్గురు ఎంపీటీసీలు

మిడ్జిల్, వెలుగు: మండలంలోని ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాసం నోటీసులు అందించారు. కాంగ్రెస్  పార్టీ ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికైన కాంతమ్మ బాలస్వామి రాజీనామా అనంతరం ఎంపీపీ పదవి దక్కించుకున్న సుదర్శన్ పై ఎంపీటీసీలు సోమవారం ఆర్డీవో అనిల్, జడ్పీ సీఈవో జ్యోతికి అవిశ్వాసం నోటీసులు అందించారు.

దోనూరు, వెలుగొమ్ముల, కొత్తపల్లి ఎంపీటీసీలు బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్​లో చేరారు. మండలంలోని 9 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు ఎంపీటీసీలు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. ఎంపీటీసీలు గౌస్, నరసింహ, కాంతమ్మ బాలస్వామి, వసంత రమేశ్, కాంగ్రెస్  పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు.