ఎంపీ కొడుకైతే అరెస్ట్‌‌‌‌ చేయరా? ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా.. మాదాపూర్‌‌‌‌‌‌‌‌ యాక్సిడెంట్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు

ఎంపీ కొడుకైతే అరెస్ట్‌‌‌‌ చేయరా? ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా.. మాదాపూర్‌‌‌‌‌‌‌‌ యాక్సిడెంట్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు

  హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెంద డం.. నిందితుడైన ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయకపో వడంపై పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నెల 16న ఇనార్బిట్‌‌ మాల్‌‌ వద్ద రోడ్డు దాటుతున్న  భారతి ముఖి(26)ని ఎంపీ లింగమనేని రమేశ్​ కుమారుడు సంజూష్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్క డే ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్‌‌ మీడియాలో ట్రోల్స్‌‌ చక్కర్లు కొడుతున్నాయి.

నిందితుడు ఎంపీ కుమారుడు కావడం వల్లే అరెస్ట్‌‌ చేయకుండా స్టేషన్ బెయిల్ మంజూరు చేశా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశాకు చెందిన భారతి ముఖి (26) మాదాపూర్​లో ఉంటూ ఇనార్బిట్​మాల్‌‌లోని ఓ స్టోర్‌‌‌‌లో సేల్స్​గర్ల్‌‌గా పనిచేస్తున్నది. ఈ నెల 16న మధ్యాహ్నం తన స్నేహితురాలు పూజాతో కలిసి భోజనం కోసం ఐటీసీ కోహినూర్​ వైపు వెళ్లింది. భోజనం తీసుకొని తిరిగి ఇనార్బిట్​మాల్​వైపు రోడ్డు దాటుతుండగా మాదాపూర్​ వైపు నుంచి వేగంగా దూసుకు వచ్చిన కారు భారతిని ఢీకొట్టింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆ సమయంలో  కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు  లింగమ నేని రమేశ్ ​కుమారుడు సంజూష్ నడుపుతున్నాడు. రాష్​ డ్రైవింగ్‌‌తో  యువతి మృతికి కారణమైన  సంజూష్​పై పోలీసులు కేసు నమోదు చేసి, 5 రోజుల తర్వాత స్టేషన్‌‌ బెయిల్ మంజూరు చేసి నోటీసులు ఇచ్చారు.  

డీసీపీ రితిరాజ్‌‌ వివరణ..

సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేసు బెయిలబుల్ కావడంతోనే నిందితుడు సంజూష్​కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశామని డీసీపీ రితిరాజ్ చెప్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజే నిందితుడు సంజూష్​ను అదుపులోకి తీసుకొని, డ్రంక్​ అండ్​ డ్రైవ్​, డ్రగ్స్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. సంజూష్​ అరెస్ట్ విషయంలో తమపై ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిందితుడిపై బీఎన్ఎస్106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.