‘ఈగల్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రేమికుల రోజు సందర్భంగా బుధవారం స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
హీరోహీరోయిన్స్ హగ్ చేసుకున్నట్టుగా ఉన్న రొమాంటిక్ పోస్టర్ ఇది. ఇందులో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తు న్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అంది స్తున్నాడు.