వీడియో: ఎమ్మార్వో ఆఫీసుకు తాళం పెట్టిన సాధారణ మహిళ

వీడియో: ఎమ్మార్వో ఆఫీసుకు తాళం పెట్టిన సాధారణ మహిళ

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు తాటిగుంట గ్రామానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారంటూ ఎమ్మార్వో ఆఫీస్‌కు తాళం వేసి, పురుగుల మందు తాగేందుకు యత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మార్వో, సర్వేయర్, ఆర్ఐలు తనను మోసం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు ఆరోపణలు చేసింది. తాటిగుంట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, జయన్న, వెంకట్రాంలతో కలిసి అధికారులు తన భూమిని కాజేశారని ఆరోపించింది.