విజయారెడ్డి డ్రైవర్ గురునాథం దీనగాథ..

విజయారెడ్డి డ్రైవర్ గురునాథం దీనగాథ..

తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి చంపిన ఉదంతంలో ఆమెను కాపాడబోయిన డ్రైవర్ గురునాథం డిఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సూర్యపేట జిల్లా, గరిడేపల్లి మండలం, వెలిదండ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, రమణ దంపతుల పెద్ద కొడుకు గురునాథం. ఆయన గత 6 సంవత్సరాలుగా తహసీల్దార్ విజయారెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా, గురునాథంకు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు.  గురునాథం భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అకస్మాత్తుగా కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురునాథం మృతి చెందడంతో అతని భార్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆమెను ఓదార్చడం అక్కడున్నవారి వల్ల కావడంలేదు.