
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంతో ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్గా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో సీతగా నటించిన మృణాల్కు డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డు దక్కింది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనే చాన్స్ అందుకున్న మృణాల్.. ఈ అవార్డు రావడంతో మరింత హ్యాపీగా ఉంది.
ఈ సందర్భంగా ఇన్స్టాలో ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘జీవితం నిజంగా ఫుల్ సర్కిల్ లాంటిది. నా సినిమా జర్నీ మెల్బోర్న్లోనే మొదలుపెట్టాను. మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్లో జాయిన్ అవడం, అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. బెస్ట్ మూవీగా నిలిచిన ఈ చిత్రం నుంచి నాకు అవార్డు రావడం గ్రేట్గా అనిపిస్తుంది. ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిస్తుంది.
కథ చెప్పే విధానంలో లాంగ్వేజ్కు కల్చర్కు పరిమితులు లేకుండా ఉండాలి. భవిష్యత్తు ప్రయాణం మరింత ఎక్సయిటింగ్గా ఉంటుందని భావిస్తున్నా’ అని పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో నానికి జంటగా నటిస్తున్న మృణాల్.. హిందీలో పూజా మెరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలి సినిమాల్లో నటిస్తోంది.