రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసిన కొత్త హీరోయిన్

రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసిన కొత్త హీరోయిన్

సీతారామం మూవీతో అందరి హృదయాలను దోచుకున్న బ్యూటీ మృణాల్ థాకూర్(Mrunal Thakur). ఈ భామ మొదట్లో సీరియల్ నుంచి తన కెరీర్ ను స్టార్ట్ చేసి నేడు వరుస మూవీస్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను వరుస హిట్లతో సక్సెస్ రేటును పెంచేసుకోంది. తాజా సమాచారం ప్రకారం మృణాల్ తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు టాక్. 

మృణాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన మొదటి సినిమాకే 85 లక్షలు పారితోషికం తీసుకోగా.. ప్రస్తుతం చేస్తోన్న మూవీస్ కు 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. ఇక ఈ మూవీస్ అన్నీస్టార్ హీరోలతో వస్తుండటంతో పాటు..కంటెంట్ ఉన్న సినిమాలు కావడంతో.. తన నెక్ట్స్ మూవీస్ కు రెమ్యూనరేషన్ రూ.3కోట్ల వరకు తీసుకుంటోందని సమాచారం. 

మృణాల్ అందంలోనూ, తన నటనలోనూ టాలెండ్ అని నిరుపించుకుంది. కనుకే స్టార్ హీరోలందరూ తనతో నటించాలని అనుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ సైతం రెమ్యూనరేషన్ విషయంలో వెనుక అడుగు వేయట్లేదని తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ‘లస్ట్ స్టోరీస్-2’లో ఇటీవల నటించింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం మృణాల్ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్‍లో నానీ 30వ సినిమాలోనూ.. దీంతో పాటు విజయ్ దేవరకొండ చేసే తర్వాతి సినిమాలోనూ, రామ్ చరణ్ RC16 మూవీస్ లోను మృణాల్‍ హీరోయిన్‍గా చేయనుంది. 

2014లో మరాఠీ మూవీ విట్టి దండుతో సినిమా రంగంలోకు ఎంట్రీ ఇచ్చిన మృణాల్..ఆ తర్వాత బాలీవుడ్‍లో లవ్ సోనియా, సూపర్ 30, బాట్లా హౌస్, హిందీ జెర్సీ మూవీస్ లో నటించారు. హను రాఘవపూడి దిరెచ్తిఒన్ లో వచ్చిన సీతారామం తో ఈ మృణాల్ కేరీర్ లోనే  క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది.