హైదరాబాద్, వెలుగు: ప్రకటనలు, ప్రజా సంబంధాలు, డిజిటల్ మార్కెటింగ్లో సేవలు అందించే మల్టీవర్స్ సంస్థ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లకు సేవలను విస్తరిస్తామని ప్రకటించింది. సంస్థ ఫౌండర్ విజయ్ గతంలో బయోలాజికల్ ఈ, టాటా ప్రాజెక్ట్స్ వంటి సంస్థల్లో పనిచేశారు. తమ నైపుణ్యం, అనుభవాన్ని ఉపయోగించి కంపెనీల బ్రాండ్ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
