ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కిన ఆనందంలో జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ప్రెస్ మీట్ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె.. తన పేరు ప్రకటించగానే తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తొలి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో ఆమె తన తండ్రి ఫోటోకు నమస్కరిస్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. అలాగే టీవీ ముందు కేసీఆర్ కు దండం పెట్టి కన్నీరు పెట్టుకుంది. తనను గుర్తించి టికెట్ కేటాయించిన కేసీఆర్ కు నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై ఈమె పోటీ చేయనుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో దాదాపు ఏడుగురు సిట్టింగులకు కేసీఆర్ సీట్లు ఇవ్వలేదు. ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.