విలువ లేదని కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎంపీపీ

విలువ లేదని కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎంపీపీ

అధికారులు ప్రతిపక్ష నేతల మాటలే కాదు..అధికార పార్టీ నేతల మాటలకు కూడా విలువ ఇవ్వట్లేదు. అధికారులు తన మాట వినడం లేదు..విలువ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ మహిళా ఎంపీపీ కన్నీరు పెట్టుకుంది. అధికారులు తన మాట వినడం లేదని.. ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శారద వెక్కి వెక్కి ఏడ్చారు. అధికార పార్టీకి చెందిన తన మాటే వినకుంటే ఎలా అని ప్రశ్నించారు. రైతు వేదికల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే తన మాట వినకపోగా విలువ ఇవ్వలేదన్నారు. ఇదేంటని అడిగితే నువ్వెంత..నీ వయసెంత అని అన్నారని తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయాన్ని జడ్పీ ఛైర్మన్, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు శారద.