చివరి శ్వాస వరకు ప్రజా సేవ కొనసాగిస్తానన్న సీతక్క

చివరి శ్వాస వరకు ప్రజా సేవ కొనసాగిస్తానన్న సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో ఆమె పీహెచ్ డీ పూర్తిచేశారు. పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేసేందుకు సహకరించిన హెచ్ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొ. అశోక్ నాయుడు, ప్రొ. చంద్రు నాయక్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై చేసిన పరిశోధనకుగానూ ఆమెకు డాక్టరేట్ వచ్చింది. 

చిన్నతనంలో తానెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదని, నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్ అవుతానని, లాయర్‌ అయ్యాక ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేస్తానని అనుకోలేదని సీతక్క చెప్పారు. ఇప్పుడు అందరూ తనను డాక్టర్ అనుసూయ సీతక్క పీహెచ్ డీఅని పిలవచ్చని అన్నారు. ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం తన అలవాటని, చివరి శ్వాస వరకు దాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.