బెంగళూరు/ఆలుర్: రంజీ ట్రోఫీలో ముంబై 47వ సారి ఫైనల్కు దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్ జట్టు కూడా 23 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్కు వచ్చి ముంబైతో అమీతుమీకి రెడీ అయింది. శనివారం ముగిసిన సెమీఫైనల్స్లో బెంగాల్పై 174 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ విజయం సాధించగా.. ఉత్తర్ప్రదేశ్తో పోరును డ్రా చేసుకున్న 41సార్లు చాంపియన్ ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముందంజ వేసింది. ఓవర్నైట్ స్కోరు 449/4తో ఐదో రోజు ఆట కొనసాగించిన ముంబై మరో పదహారు ఓవర్లు ఆడి రెండో ఇన్నింగ్స్ను 533/4 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో యూపీ ఛేజింగ్కు రాకుండా డ్రాకు అంగీకరించింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 393 స్కోరు చేయగా.. యూపీ 180కే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్ (100, 181)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు మధ్యప్రదేశ్ ఇచ్చిన 350 రన్స్ ఛేజింగ్లో 96/4తో ఆట కొనసాగించిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 175 వద్ద ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. ఎంపీ బౌలర్ కుమార్ కార్తికేయ (5/67) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. గౌరవ్ యాదవ్ (3/19), సారాంశ్ జైన్ (2/69) రాణించారు. ఎంపీ ప్లేయర్ హిమాన్షు మంత్రికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బెంగళూరు వేదికగా ముంబై, మధ్యప్రదేశ్ మధ్య ఈ నెల 22న ఫైనల్ మొదలవుతుంది.
47వ సారి రంజీ ఫైనల్లో ముంబై
- ఆట
- June 19, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?