- దిశా పటాని, టైగర్ ష్రాఫ్లపై ఎఫ్ఐఆర్
బాలీవుడ్ నటులు దిషా పటాని, టైగర్ ష్రాఫ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో లాక్డౌన్ సమయంలో వీరిద్దరూ సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతుండటమే దీనికి కారణమని తెలిసింది.
కోవిడ్ -19 ఆంక్షలను ఉల్లఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరిద్దరూ ముంబైలోని బ్యాండ్స్టాండ్ ప్రొమెనాడలో బయటతిరుగుతూ కనిపించారు. ఎటువంటి సరైన కారణం లేకుండా.. నటులు బయట తిరుగుతున్నట్లు తెలిసింది. కరోనా కట్టడి కోసం మహారాష్ట్రలో లాక్డౌన్ జూన్ 15 వరకు పొడిగించబడింది. అవసరమైన సేవలు మినహా మధ్యాహ్నం 2 గంటల తరువాత రాష్ట్రవ్యాప్తంగా పఠిష్టమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
దిషా మరియు టైగర్ ష్రాఫ్ల పేర్లు ప్రస్తావించకుండా.. వారు నటించిన సినిమా పేర్లను ప్రస్తావిస్తూ కేసు నమోదు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. నటులిద్దరూ జిమ్ నుంచి మధ్యాహ్నం రెండు తర్వాత రోడ్డు మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పోలీసులు వారి కారును ఆపి.. వివరాలు తెలుసుకొని పంపించివేశారు. ఆ వీడియో ఆధారంగా వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.