
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ ‘26/11’ తరహా దాడులు చేస్తామంటూ పాకిస్తాన్ ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివేక్ పన్సల్కర్ తెలిపారు. వర్లీ నుంచి ఆపరేట్చేస్తున్న ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ వాట్సాప్ నెంబర్కు ఈ మెసేజ్ వచ్చిందని వివరించారు. శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మెసేజ్ వచ్చిన వెంటనే యాంటీ టెర్రరిజం స్క్వాడ్తో పాటు సిటీ పోలీసులను అలర్ట్ చేశామని తెలిపారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల టైంలో ఈ మెసేజ్ వచ్చిందన్నారు. 26/11 దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు అజ్మల్ కసబ్తో పాటు ఆల్ఖైదా లీడర్ అయ్మన్ అల్ జవహ్రీ పేరును కూడా ప్రస్తావించారని వివరించారు.
దాడుల కోసం తమ వాళ్లు కొంత మంది ముంబైలోనే ఉంటూ ప్లాన్ చేస్తున్నారని మెసేజ్లో ఉన్నట్టు తెలిపారు. ఈ మెసేజ్ను సీరియస్గా తీసుకున్నామని, ప్రజల భద్రతతో పాటు వారి రక్షణ బాధ్యత ముంబై పోలీసులదే అన్నారు. బెదిరింపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, కోస్టల్ ఏరియా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశామన్నారు. కోస్ట్ గార్డ్స్తో కో–ఆర్డినేట్ చేయాల్సిందిగా సూచించామని తెలిపారు. సాగర్ కవచ్ ఆపరేషన్ను లాంచ్ చేశామని పేర్కొన్నారు. ఈ ప్లాన్ను ఆరుగురు కలిసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారని మెసేజ్లో ఉందని తెలిపారు. ఇప్పుడు చేసే దాడులు 26/11ను గుర్తు చేస్తాయంటూ బెదిరించినట్టు వివరించారు.