లైంగికంగా వేధించాడంటూ అనురాగ్ కశ్యప్ పై పాయల్ కేసు

లైంగికంగా వేధించాడంటూ అనురాగ్ కశ్యప్ పై పాయల్ కేసు

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ కేసు పెట్టింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో తెలిపింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 354, 341, 342 కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు.. కేసుపై త్వరగా దర్యాప్తు చేయకపోతే తాను నిరాహారదీక్ష చేస్తానని పాయల్ ఘోష్ హెచ్చరించింది. అంతేకాదు.. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసింది. దీనికితోడు, నిన్న(ఆదివారం) మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఇదే విషయంపై ఫిర్యాదు చేసింది. వీటన్నింటితో అనురాగ్ కశ్యప్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు.