ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : మురళీధర్ రావు

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : మురళీధర్ రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు, కుంటలు, భూములు, మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాలకు బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుంభకోణాన్ని బయటకు తీసి, కారకులైన వారిని జైలుకు పంపించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. కూకట్ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని  మురళీధర్ రావు ప్రారంభించారు. 

ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ, బీజేవైఎం నేతలను అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.