వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని స్నేహితుడి హత్య

వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని స్నేహితుడి హత్య

జీడిమెట్ల, వెలుగు: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జగదీశ్వర్​రెడ్డి(26) కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి సూరారం కాలనీకి వచ్చాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

సుభాష్​నగర్​కు చెందిన సోహైల్, అజయ్, బిహార్ కు చెందిన కుందన్​తో స్నేహం ఏర్పడింది. కొంతకాలంగా జగదీశ్వర్​రెడ్డి సోహైల్ ​వ్యక్తిగత జీవితంలో తలదూరుస్తుండటంతో సోహైల్ కు అతని మిత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో జగీశ్వర్​రెడ్డిని చంపాలని సోహైల్ అజయ్, కుందన్​తో కలిసి ప్లాన్​వేశాడు. ఆదివారం రాత్రి అతన్ని మద్యం తాగేందుకు ఫాక్స్ సాగర్​చెరువు వద్దకు పిలిపించారు. మద్యం తాగాక వారి మధ్య మాటామాట పెరిగింది. ఆ ముగ్గురూ కత్తితో జగదీశ్వర్​రెడ్డిపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత సోహైల్ పోలీసులకు లొంగిపోయాడు. సోహైల్ పై గతంలో పలు కేసులు ఉన్నాయి. అజయ్, కుందన్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.