మూసీ డెవలప్మెంట్ .. లంగర్ హౌస్ నుంచి నాగోలు వరకు.. 9 వేల అక్రమ నిర్మాణాలు

మూసీ డెవలప్మెంట్  .. లంగర్ హౌస్ నుంచి నాగోలు వరకు.. 9 వేల అక్రమ నిర్మాణాలు

మూసీ నది బ్యూటిఫికేషన్​పై సీఎం రేవంత్​రెడ్డి స్పెషల్​ఫోకస్​పెట్టారు. సిటీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ అంశాన్ని గుర్తుచేస్తున్నారు. బ్యూటిఫికేషన్​లో భాగంగా గ్రేటర్​పరిధిలో ఇండ్లు కోల్పోయేవారికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం నిర్వహించిన మీటింగ్​లో ఈ అంశంపై చర్చించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల పరిధిలో మూసీ నది 44 కిలోమీటర్లు ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో నది బఫర్​జోన్​లో 9 వేల అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ప్రస్తుతం రెండింతలై ఉంటాయని అంచనా. మూసీ నదికి ఇరు వైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్​లో ఉన్న నిర్మాణాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని అప్పట్లో అధికారులు గడువు ఇచ్చారు. 

తర్వాత కొందరికి నోటీసులు జారీ చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్​దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది. గతంలో మూసీ బ్యూటిఫికేషన్​లో ఇండ్లు కోల్పోతున్నవారు డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ముందుగా నిర్వాసితులకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు అందించి, తర్వాత బ్యూటిఫికేషన్​పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.