మూసీ నది బ్యూటిఫికేషన్పై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ఫోకస్పెట్టారు. సిటీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ అంశాన్ని గుర్తుచేస్తున్నారు. బ్యూటిఫికేషన్లో భాగంగా గ్రేటర్పరిధిలో ఇండ్లు కోల్పోయేవారికి డబుల్బెడ్రూమ్ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం నిర్వహించిన మీటింగ్లో ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల పరిధిలో మూసీ నది 44 కిలోమీటర్లు ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో నది బఫర్జోన్లో 9 వేల అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ప్రస్తుతం రెండింతలై ఉంటాయని అంచనా. మూసీ నదికి ఇరు వైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని అప్పట్లో అధికారులు గడువు ఇచ్చారు.
తర్వాత కొందరికి నోటీసులు జారీ చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది. గతంలో మూసీ బ్యూటిఫికేషన్లో ఇండ్లు కోల్పోతున్నవారు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ముందుగా నిర్వాసితులకు డబుల్బెడ్రూమ్ఇండ్లు అందించి, తర్వాత బ్యూటిఫికేషన్పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.