
సినీ నటుడు నాగచైతన్య తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లాడు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి మరీ ఈ వేడుకకు హాజరయ్యాడు. నాగచైతన్య పర్సనల్ అసిస్టెంట్ వెంకట్ పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ పెళ్లికి ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య వెళ్లడం విశేషం. నటి శోభిత ధూళిపాళ్లను నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
#నాగచైతన్య పర్సనల్ అసిస్టెంట్ #వెంకట్ ఫ్యామిలీ అన్న పెళ్లి రాజమండ్రి లో జరుగుతుంది దానికి వచ్చిన చైతుబాబు - ❤️?#HappyMarriageLife ❤️ #VenkeyKokipudi #SuneethaKonkipudi pic.twitter.com/tmxCNr8c6x
— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) August 9, 2024
ఆగస్ట్ 8న నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా జరిగింది. నిశ్చితార్థం ఫొటోలను నాగచైతన్య తండ్రి, సినీ నటుడు నాగార్జున తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొడుకు రెండో పెళ్లి గురించి అఫిషియల్గా చెప్పేశాడు.
Yuvasamrat @chay_akkineni attented his personal assistant wedding ceremony in Rajahmundry ? pic.twitter.com/gJBSB66Vlx
— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) August 9, 2024
సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్న కొన్నాళ్లకు ఇద్దరి దారులు వేరైపోయిన సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య దగ్గరై.. కొన్నాళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ రిలేషన్ను ఎమోషనల్ కమిట్మెంట్గా మార్చుకుని పెళ్లి వైపుగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల అడుగులేయాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు అందుకు అంగీకారం తెలపడంతో ఇటీవల ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది.
ఈ శ్రావణ మాసంలోనే చైతూ, శోభిత పెళ్లి కూడా జరిగే అవకాశాలున్నాయి. అయితే నిశ్చితార్థం జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పర్సనల్ అసిస్టెంట్ పెళ్లికి నాగచైతన్య వెళ్లడం ఇంట్రస్టింగ్గా అనిపించింది. కాబోయే పెళ్లి కొడుకు కొత్త జంటను దీవించేందుకు వెళ్లడం బాగుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్యను చూసి కొత్త జంట ఎంతో సంతోషించారు. నాగచైతన్య ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతూతో కలిసి ఫొటోలు దిగారు. కొత్త జంట మాత్రమే కాదు పెళ్లికి వెళ్లిన అతిథులు కూడా నాగచైతన్యతో ఫొటోల కోసం, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రాజమండ్రిలోని ఒక ఫంక్షన్ హాల్లో నాగచైతన్య పర్సనల్ అసిస్టెంట్ పెళ్లి జరిగింది.