టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్య

టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్య

బీజేపీ నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కేసీఆర్ ను కలిసిన అంజయ్య తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కడారి అంజయ్య.అయితే రవినాయక్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ. సాగర్ ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహ్మయ్య కొడుకు నోముల భగత్, కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి పోటీకి దిగుతున్నారు.