కరోనాతో ఆరు నెలల గర్భవతి మృతి

కరోనాతో ఆరు నెలల గర్భవతి మృతి

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల పశువైద్యాధికారి నాగమణి (38) కరోన తో చనిపోయారు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. గత రెండున్నర సంవత్సరాలుగా పి.ఏ పల్లి వెటర్నరీ ఆస్పత్రిలో పనిచేస్తూ.. ప్రస్తుతం సాగర్ లో విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం డిప్టేషన్ మీద ఆమె సాగర్‌కు వెళ్లారు. కరోనా బారిన పడిన నాగమణి.. హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా.. శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. నాగమణి భర్త కేశవ్ అజ్మీర్ సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్‌లో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.