కందనూలు, వెలుగు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను స్పీడప్ చేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఓటర్కు సమగ్ర అవగాహన కల్పించి, ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిచేయించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆర్డీవో అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్ పాల్గొన్నారు.
