
నాగశౌర్య హీరోగా రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్కుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.