మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే 

మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే 

 గాయపడ్డ యువకులను ఆసుపత్రిలో చేర్పించిన ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య

నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరోసారి మానవత్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకులను ఆసుపత్రిలో చేర్పించి నిజమైన ప్రజా సేవకుడని నిరూపించుకున్నాడు. వివరాలలోకి వెళ్తే ..ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్లగొండ నుంచి నార్కట్ పల్లికి కారులో వెళ్తున్నాడు.  అలా వెళ్లె సమయంలో  అన్నేపర్తి స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి బాధతో అరుస్తున్న యువకులను చూశాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కారు దిగి ఆ యువకులన తన సొంత వాహనంలో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించాడు. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరాడు. 

ఇవి కూడా చదవండి..

సొంత బిడ్డను ఎలుగుబంటిపైకి విసిరేసింది