హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురిసింది. అతి భారీ వర్షానికి కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇటు అతి భారీ వర్షానికి నాంపల్లి యుసుఫిన్ దర్గా నీటమునిగింది. దర్గాలోకి భారీగా వరద నీరు చేరింది.
దర్గాలోపల మోకాళ్ల లోతులో నీరు చేరింది. వర్షపు నీటితో భక్తులు, దర్గాలోని దుకాణాల నిర్వాహకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తులు, దర్గా నిర్వాహకులు నీటిని బయటకు తోడుతున్నారు. భక్తుల నుండి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ...మౌలిక వసతులు లేకపోవడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.