రూ.కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన బాలయ్య

రూ.కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన బాలయ్య

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమయింది. అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పైస సంపాదన లేక పేద,మధ్యతరగతి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వంతు సాయంగా కోటి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో తెలంగాణ,ఏపీలకు చెరో రూ.50 లక్షలు ఇచ్చారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ)కి రూ.25 లక్షలు ఇచ్చారు.  ఈ చెక్కును ప్రొడ్యూసర్ సీసీసీ సభ్యుడు సి.కళ్యాణ్ కు అందజేశారు.

 

see more news

కరోనా మృతుల అంత్యక్రియలకు కేంద్రం గైడ్​లైన్స్

నర్సులకు వేధింపులు..ఆరుగురు జమాత్ సభ్యులపై కేసు

మందుకు నో లాక్ డౌన్.. బీరు రూ.300, ఫుల్ బాటిల్ 2000