రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం బాలకృష్ణ యాడ్

రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం బాలకృష్ణ యాడ్

కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క యాడ్ చేయని ‘నందమూరి బాలకృష్ణ’.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం యాడ్ చేశారు. గురువారం యాడ్ లాంచ్ ప్రోగ్రాం గ్రాండ్ గా జరిగింది. బాలయ్య రేంజ్ కు తగ్గట్టు యాడ్ ను రూపొందించారు. సినిమాటిక్ స్టైల్ లో బాలయ్య డైలాగ్స్ చెప్పారు. సాయిప్రియ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కొత్తగా కట్టే ప్రాజెక్టు కోసం బాలయ్యతో యాడ్ చేశారు. యాడ్ లో పవర్ ఫుల్ గా బాలయ్య కనిపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఫ్లయిట్ లో ఉన్న బాలకృష్ణ కాస్ట్లీ కారు ఎక్కి.. జనాల మధ్యలోకి వెళ్లారు.

‘కొందరు నీళ్లలాగా పల్లానికి కాదు, రాకెట్ లా పైకి దూసుకపోతారు. ప్రపంచంతో నడవరు, ప్రపంచానికే నడక నేర్పిస్తారు. ఒంటరిగా గెలవడం కాదు, వెంటున్న అందర్నీ గెలిపిస్తారు. బంగారంలా తరిగిపోరు, వజ్రంలా వెలిగిపోతారు. లెజెండ్ లా నిలిచిపోతారు. ఆ కొందరిలో మీరు ఒకరైతే.. మీ కోసమే 116 పారామౌంట్, లివ్ లైక్ ఎ లెజెండ్, ఏ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు అఫ్ సాయి ప్రియా గ్రూప్’ అంటూ తనదైన స్టైల్ లో బాలయ్య చెప్పారు. అనంతరం ఓ చిన్నారి అట్టముక్కలతో ఇల్లు కట్టగా.. బాలకృష్ణ చప్పట్లతో అభినందిస్తారు. అంతలోనే గాలి వచ్చి.. ఓ అట్టముక్క పడిపోతుంది. దీంతో బాలయ్య చిరునవ్వు నవ్వి.. మరలా దానిని కట్టిస్తాడు. ‘బొమ్మరిల్లు ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు.. కానీ మనం కలలు కనే ఇల్లు జీవితంలో ఒకటే సారి కట్టుకుంటాం.. ఆ ఇల్లు నమ్మకం, నాణ్యత, నవ్యత, నిబద్దత అనే నాలుగు పటిష్టమైన స్తంభాలపైన నిలబడాలి.. అలా నిలబడిందే సాయి ప్రియ గ్రూప్’ అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ‘అఖండ’ సినిమా ఘన విజయం అనంతరం మరో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘వీర సింహా రెడ్డి’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ లు భారీ ఎత్తున సినిమాను రూపొందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.