జోగులాంబను దర్శించుకున్న  నారా బ్రాహ్మణి

జోగులాంబను దర్శించుకున్న  నారా బ్రాహ్మణి

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి అమ్మవార్లను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మంగళవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో పురేందర్ కుమార్, అర్చకులు స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.