హైదరాబాద్ మెట్రోలో బ్రాహ్మణి, దేవాన్ష్

హైదరాబాద్ మెట్రోలో బ్రాహ్మణి, దేవాన్ష్

ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, ఆయన కొడుకు దేవాన్ష్ ఇవాళ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహీల్స్ నుంచి లక్డీకాపూల్ వరకు ప్రయాణించారు. మెట్రోలో వారిని చూసి గుర్తు పట్టిన వారు కొందరు సెల్ఫీలు దిగారు. లక్డీకాపూల్ లో దిగిన వారు అక్కడి నుంచి వేరే వాహనంలో  ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు  వెళ్ళినట్లు తెలుస్తోంది. మెట్రోలో వెళ్లాలనే ఆసక్తితోనే వారు  ప్రయాణించినట్లు చెబుతున్నారు.