చైనాలో భారీ పేలుడు..9మంది మృతి

చైనాలో భారీ పేలుడు..9మంది మృతి

చైనాలో భారీ పేలుడు సంభవించింది.  మధ్య చైనాలో టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుతో 9మంది అక్కడికక్కడే మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు. హునాన్ ప్రావిన్స్ లోని లిన్ లీ కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. చైనా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియోల్లో భారీ పేలుడుతో  ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ, ఎగిసి పడుతున్న మంటల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పేలుడు పక్కనే ఉన్న భవనాలు కుప్పకూలాయి. భవనాలు కూలుతున్నప్పుడు స్థానిక ప్రజల భయంతో పరుగులు పెట్టారు. 

ALSO READ | ఇరాన్ గురిచూసి కొడుతోందా..? ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మెుసాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి..!

సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..అయితే మరిన్ని బాణసంచా ఫ్యాక్టరీ కావడంతో మరిన్ని పేలుళ్లు సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి. మంటల ఆర్పేందుకు నీటీ వనరులు లేని పర్వత ప్రాంతాల్లో ప్రమాద స్థలం ఉండటంలో మంటలార్పడం పెద్ద సవాల్ మారింది. దాదాపు 20 గంటలకు పైగా రెస్క్యూ టీం  రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగులతో మంటలార్పేసింది.

చైనాలో అస్పష్టమైన నిబంధనలు ,భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్ల పారిశ్రామిక ప్రమాదాలు చాలా సాధారణం. మే నెలలో తూర్పు ప్రావిన్స్ షాన్డాంగ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో కనీసం ఐదుగురు మృతిచెందారు. 2015లో ఓడరేవు నగరమైన టియాంజిన్‌లో మండే కెమికల్స్ గోడౌన్స్ లో పేలుడు సంభవించి 170 మందికి పైగా మృతి చెందారు. 700 మందికి పైగాయపడ్డారు.