
ప్రపంచంలో శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల విషయానికి వస్తే అందులో మెుసాద్ పేరు టాప్ లిస్టులోనే ఉంటుంది. శత్రువుకు కూడా అనుమానం రాకుండా టార్గెట్లను ఫినిష్ చేసి రాగలిగే శక్తి ఆ సంస్థకు ఉంది. ఇజ్రాయెల్ తన చుట్టూ శత్రుదేశాలు ఉన్నప్పటికీ మనుగడను కొనసాగించగలుగుతోందంటే దీని అత్యుత్తమ పనితీరేనని యుద్ధ నిపుణులు చెబుతుంటారు. పైగా రక్షణ విషయానికి వస్తే అమెరికా ఇప్పుడు గోల్డెన్ డోమ్ అంటుంటే.. ఇజ్రాయెల్ ఎప్పుడో ఐరన్ డోమ్ అంటూ గగనతల దాడులను అరికట్టేందుకు రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకుంది.
ALSO READ | ఇరాన్ పవర్ ఫుల్ లీడర్ ను చంపేసిన ఇజ్రాయెల్ : ఇంతకీ ఎవరీ షాద్మానీ..?
అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణంలో రెండు దేశాలు భీకర దాడులకు వెళుతున్నాయి. ఈసారి చూస్తే ఇజ్రాయెల్ లోని అనేక ప్రాంతాలపై ఇరాన్ మిస్సైల్స్ ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా టెల్ అవివ్ లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మెుసాద్ హెడ్ క్వార్ట్స్ పై ఇరాన్ దాడి చేసినట్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ నివేదించింది. తాము ఇజ్రాయెల్ లోని కీలక ప్రదేశాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషినరీ గార్డ్ కార్ప్స్ నేడు ప్రకటించింది.
⚡️Iran strikes Mossad headquarters in Israel's Herzliya, SNN reports pic.twitter.com/K87vh7nm00
— Sputnik (@SputnikInt) June 17, 2025
ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హబ్ అమన్ పై తాము దాడులు చేసినట్లు ఇరాన్ చెబుతోంది. అయితే మెుసాద్ కేంద్రం మంటల్లో దగ్ధమౌతున్న వీడియో దానికి సాక్ష్యం అంటూ ఇరాన్ మీడియా చెబుతోంది. సెంట్రల్ టెహ్రాన్లోని ఒక కమాండ్ సెంటర్పై రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ సీనియర్ కమాండర్ అలీ షమ్దానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత మొసాద్ కాంపౌండ్పై దాడులు జరిగాయి. అయితే మరో పక్క ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మౌలిక సదుపాయాలు, డ్రోన్ సైట్స్, లాంట్ ఫ్లాట్ ఫారమ్ లు, స్టోరేజ్ డిపోలను టార్గెట్ చేసి దాడులను కొనసాగిస్తోంది. దీంతో శుక్రవారం నుంచి రెండు దేశాల మధ్య బాంబుల మోత మోగుతోంది.