
ఇరాన్- ఇజ్రాయోల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో వరుసగా నాల్గో రోజు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయోల్ విరుచుకుపడుతోంది.
జూన్ 16న ఇరాన్ ప్రభుత్వ న్యూస్ ఛానల్ బిల్డింగ్ పై ఇజ్రాయోల్ మిస్సైల్ దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగానే ఒక్కసారిగా మిస్సైల్ భవనాన్ని ఢీ కొట్టింది. బిల్డింగ్ షేక్ అయి,పవర్ కట్ అయ్యింది. గజగజ వణికిపోయిన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది. వెంటనే లైప్ టెలికాస్ట్ ను నిలిపివేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The moment Israel attacked the Iranian Broadcasting Corporation pic.twitter.com/31N8cXz2OD
— War & Gore (@Goreunit) June 16, 2025
ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రధాన కార్యాలయంపై తమ సైన్యం దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ధృవీకరించారు.టెహ్రాన్ లోని టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకుముందే ఇజ్రాయోల్ హెచ్చరించడం గమనార్హం.
ఇజ్రాయెల్కు అమెరికా, ఇరాన్కు ఇతర ముస్లిం దేశాలు మద్దతు ఇస్తుండటంతో తాజా యుద్ధం వరల్డ్ వార్ 3కి దారి తీసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు యుద్ధ నిపుణులు. ఈ తరుణంలో ఐఆర్జీసీ టాప్ కమాండర్, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మొహ్సేన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ టెలివిజన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్పై ఇజ్రాయెల్ అణు బాంబును ప్రయోగిస్తే, పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్పై తిరిగి అణు బాంబుతో దాడి చేస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని జనరల్ మొహ్సేన్ రెజాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనరల్ మొహ్సేన్ రెజాయ్ వ్యాఖ్యలు ప్రపంచదేశాలను షాక్కు గురి చేయడంతో పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమైంది. జనరల్ మొహ్సేన్ రెజాయ్ వ్యాఖ్యలను ఇస్లామాబాద్ ఖండించింది.