లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ACBకి దొరికిన కాప్రా AEE

లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ  ACBకి దొరికిన  కాప్రా AEE

తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కు మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడి వాలిపోయి.. అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ.  ప్రజల్లో చైతన్యం వస్తుండడంతో అవినీతికి అలవాటు పడ్డ ఆఫీసర్ల పని పట్టేందుకు పలువురు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు సైతం మెరుపు దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు.

ALSO READ | గుడ్ న్యూస్: ఇవాళ(జూన్17) 3 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు

జూన్ 16న 20 వేలు లంచం తీసుకుంటుండగా ములుగు డీఈవో ఏసీబీకి దొరికిన సంగతి తెలిసిందే..లేటెస్ట్ గా కాప్రా ఏఈఈ లక్షా 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికింది. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీ ఏఈ స్వరూప ఓ కాంట్రాక్టర్  నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం  కాంట్రాక్టర్ నుంచి ఏఈఈ స్వరూప  రూ.1.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు . ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకున్న  ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నా, ఇతర పనులకు విరివిగా లంచాలను డిమాండ్​ చేస్తున్నారు. రెవెన్యూ, వైద్య, విద్య, లేబర్, రవాణా, ఇరిగేషన్, దేవాదాయం ఇలా పలు శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు పట్టుబడ్డారు. మరికొన్ని శాఖల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు మధ్యవర్తులను నియమించుకుని మరీ లంచం పుచ్చుకుంటున్నారు