ఢిల్లీ కాలుష్యంపై నాసా  శాటిలైట్ తో ఫొటోలు

ఢిల్లీ కాలుష్యంపై నాసా  శాటిలైట్ తో ఫొటోలు

ఢిల్లీ కొద్ది రోజులుగా కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది కూడా.. రైతులపై నెపాన్ని నెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ తర్వాత స్కూళ్లు, ఆఫీసులను ఢిల్లీ మూసేసింది. అయితే.. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం కారణంగానే నవంబర్–డిసెంబర్ మధ్య ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యం నమోదవుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన అధ్యయనంలో తేలింది.

విజిబుల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ (VIIRS) ద్వారా ఈ ఏడాది నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎన్పీపీ శాటిలైట్ ద్వారా ఫొటోలను తీసింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో ఢిల్లీ వైపు భారీ మొత్తంలో పొగ వచ్చిందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ లో మంటలూ దానికి తోడయ్యాయని తెలిపింది. 

థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలూ కాలుష్యం పెరగడానికి కారణమన్నారు.