Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్ తగ్గేదేలే..జపాన్ ఫ్యాన్స్ సర్ ప్రైజింగ్ వెల్కమ్

Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్ తగ్గేదేలే..జపాన్ ఫ్యాన్స్ సర్ ప్రైజింగ్ వెల్కమ్

బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో తన అసాధారణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna). రణబీర్ కపూర్‌తో కలిసి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

లేటెస్ట్గా ఈ అమ్మడికి సినిమా షూటింగ్కి గ్యాప్ దొరకడంతో పాటు క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్(Crunchyroll Anime Awards) లో భారత్ తరపున పాల్గొనేందుకు అవకాశం రావడంతో జపాన్ లోని టోక్యో నగరానికి వెళ్లింది. శనివారం (మార్చి 2న) టోక్యోలో క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టత్మకమైన గ్లోబల్ ఈవెంట్లో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక ఇండియన్ నటిగా రష్మిక నిలిచింది.

ఇదిలా ఉంటే..టోక్యో ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సూపర్బ్ వెల్కమ్ ఇచ్చారు. అక్కడ చాలా మంది లేడీ ఫ్యాన్స్ రష్మిక ఫొటోస్‌తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించడంతో..ఆశ్చర్యంతో కాసేపు అలా చూస్తూనే ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని తన ఫ్యాన్స్కు నవ్వుతూ హాయ్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ రేంజ్ స్వాగతం రావడం పట్ల రష్మిక ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. డియర్ కామ్రేడ్, పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మిక వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది.

ALSO READ :- Hyderabad: మ్యాన్ హోల్లో పడి ఇద్దరు కార్మికులు మృతి

రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే. అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్ తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్​రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది. ఇది రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది. అలాగే రెయిన్‌బో, ధనుష్ D51, ఛావా, అల్లు అర్జున్ పుష్ప: ది రూల్, రవితేజతో ఓ మూవీ చేయనుంది.