నిమ్స్ లో సేవలను పరిశీలించిన నేషనల్ హెల్త్ టీమ్

నిమ్స్ లో సేవలను పరిశీలించిన నేషనల్ హెల్త్ టీమ్

పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిని నేషనల్ హెల్త్ అథారిటీ టీమ్ గురువారం సందర్శించి పేషెంట్లకు అందించే  సేవలను తెలుసుకుంది.  రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచి ఆధ్వర్యంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీప్తి గౌర్ ముఖర్జీ, అడిషనల్ సీఈవో బసంత్ గార్గ్ తో కలిసి డయాలసిస్ వార్డులో ఆరోగ్యశ్రీ సేవలను ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప వివరించారు.

అనంతరం బోర్డు రూమ్ లో జరిగిన మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా  రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ రాజశేఖర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్  కృష్ణారెడ్డి, లక్ష్మీ భాస్కర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ స్వర్ణలత పాల్గొన్నారు.