హైదరాబాద్,వెలుగు: యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం నుంచి సిటీలో జరగనుంది. మొయినాబాద్లోని ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్, రిసార్ట్స్లో ఈ నెల 9 వరకు పోటీలు ఉంటాయి. మెన్స్, విమెన్స్ సింగిల్స్తో పాటు అండర్11, 13, 15,17,19 యూత్ బాయ్స్, గర్ల్స్లో మొత్తం 1,900 ఎంట్రీలు వచ్చాయని శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ టీటీ సంఘం ప్రెసిడెంట్ మహేశ్వరి వెల్లడించారు. జనరల్ సెక్రటరీ నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఇబ్రహీం ఖాన్, వైస్ ప్రెసిడెంట్ నరేశ్ రెడ్డి, టోర్నీ డైరెక్టర్ గణేశన్ పాల్గొన్నారు.
