ఇండోర్: సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (పీఎస్పీబీ) ప్లేయర్లు మానవ్ థక్కర్, యశస్విని ఘోర్పడే విన్నర్లుగా నిలిచారు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మానవ్ 4-1 తేడాతో రైల్వేస్ ప్లేయర్ జీత్ చంద్రపై ఘనవిజయం సాధించాడు. ఉత్కంఠగా సాగిన విమెన్స్ ఫైనల్లో యశస్విని 4-3తో యంగ్ ప్యాడ్లర్ సిండ్రెలా దాస్ (పీఎస్పీబీ) పై పోరాడి గెలిచి తొలిసారి నేషనల్ చాంపియన్గా నిలిచింది.
