- జూన్ క్వార్టర్లో 91 వేల యూనిట్ల అమ్మకం
న్యూఢిల్లీ:దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఇండ్ల అమ్మకాలు ఆరు శాతం తగ్గి 91,729 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో 97,674 యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్రాప్టైగర్ రియల్ ఇన్సైట్ రిపోర్ట్ప్రకారం.. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా కొనుగోలుదారులు వెనక్కితగ్గడంతో విక్రయాలు మందగించాయి.
ముంబై, ఢిల్లీ– ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, కోల్కతా, అహ్మదాబాద్లో అమ్మకాలు పడిపోయాయి. చెన్నైలో మాత్రం 36 శాతం వృద్ధితో 7,183 యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో 15 శాతం వృద్ధి కనిపించింది. జూన్క్వార్టర్లో 13,196 యూనిట్లు సేల్ అయ్యాయి.
పశ్చిమ ఆసియా ఘర్షణలు, ఉద్యోగ రంగాలపై ఏఐ ప్రభావం వంటి అంశాలు సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. కొత్త ఇండ్ల సరఫరా ఆరు శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరుకుంది. చదరపు అడుగు ధర రూ.10 వేలపైనే ఉందని రిపోర్ట్ పేర్కొంది.
