మేడిపల్లి, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య గురువారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది స్టూడెంట్లు తమ ప్రాణాలు అర్పించారన్నారు. రాష్ట్రం సాధించాక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు.
మంత్రి మల్లారెడ్డి కార్మికుల విషయంలో వ్యవహరించిన తీరు, ఉద్యమకారులకు జరిగిన అన్యాయం కారణంగానే తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా
చేస్తున్నట్లు ప్రకటించారు. తనతోపాటు ప్రజా సంఘాల నేతలు, పలువురు మాజీ ప్రజా ]ప్రతినిధులు రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. భవిష్యత్ ప్రణాళికను తొందరలోనే వెల్లడిస్తామని నత్తి మైసయ్య తెలిపారు.