హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 1996వ బ్యాచ్ కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, ఎం. దాన కిశోర్లకు అపెక్స్ స్కేల్ (లెవల్-17)కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి లేదా వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ను అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ చీఫ్ సెక్రటరీ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎం. దాన కిశోర్ను కూడా అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ఉత్తర్వులు జారీ చేశారు.
