హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ యాదవ్తో ప్రమాణం చేయించనున్నారు.
తన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి తరలిరావాలని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలుచోట్ల దీనిపై ఇప్పటికే వాల్ పోస్టర్లు కూడా అంటించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు మంత్రులను కూడా నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
