కేబినెట్ సమావేశానికి సిద్ధూ డుమ్మా

కేబినెట్ సమావేశానికి సిద్ధూ డుమ్మా

పంజాబ్ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధు. కొంతకాలంగా సిద్ధు తీరుపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్   అసంతృప్తిగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ నిరాశజనక ఫలితాలు సాధించింది. దీనికి సిద్ధూ నే కారణమనే భావన అమరీందర్ సింగ్ లో ఉంది. ఆయన దానిని బాహాటంగా వెళ్లగక్కారు కూడా. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో అర్బన్ సీట్లే కీలక పాత్ర పోషించాయన్నారు సిద్ధు. కేబినెట్ మీటింగ్ కు తనను పిలవలేదని చెప్పారు. తనకు రెండు జిల్లాల బాధ్యత అప్పగించగా… అక్కడ కాంగ్రెస్ ను గెలిపించానన్నారు.