అందరికీ కనెక్ట్ అయ్యే నవాబ్ కేఫ్

అందరికీ కనెక్ట్ అయ్యే  నవాబ్ కేఫ్

శివ కందుకూరి,  తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’.  ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది.  వాస్తవానికి ఈ సినిమాకు ‘చాయ్ వాలా’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, సెన్సార్ రూల్స్, గైడ్‌‌లైన్స్‌‌ కారణంగా ‘నవాబ్ కేఫ్‌‌’గా మార్చారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో  శివ కందుకూరి మాట్లాడుతూ ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. 

అయితే  సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌‌‌ని గౌరవిస్తూ ‘నవాబ్ కేఫ్’గా టైటిల్  మార్చాం.  ఈ టైటిల్  సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది.  టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు.  ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌‌గా ఈ మూవీని చేశాం. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 

సినిమా  చూసి బయటకు వచ్చిన తరువాత కచ్చితంగా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు’ అని చెప్పాడు.  ఇది తన  మొదటి చిత్రమని, ఏ టైటిల్ పెట్టినా కంటెంట్ బాగుంటే,  సినిమా నచ్చితే ఆడియెన్స్ ఆదరిస్తారని  హీరోయిన్ తేజు అశ్విని చెప్పింది.  తాను చూసిన,  అనుభవించిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు ప్రమోద్ హర్ష చెప్పాడు. ‘నవాబ్ కేఫ్‌‌’ను ప్రేక్షకులు ఆదరించాలని  నిర్మాత వెంకట్ కోరారు.