చత్తీస్ ఘడ్ లో పేలుడు.. జవాన్ మృతి

చత్తీస్ ఘడ్ లో పేలుడు.. జవాన్ మృతి

చత్తీస్ ఘడ్ దంతెవాడలో దారుణం జరిగింది. దంతెవాడ ఇంద్రావతి నదిపై మందుపాతర పేలింది. ఈ ఘటనలో జవాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంద్రావతి నది వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ పేలుడు జరిగింది. జవాన్ లక్ష్మీకాంత్ నిర్మాణ పనులకు భద్రతగా ఉన్నాడు. ఓ చెట్టుకింద కూర్చొని భోజనం చేస్తుండగా పేలుడు జరగడంతో 22వ బెటాలియన్ హెచ్ సీ లక్ష్మీకాంత్ మృతి చెందాడు.పేలుడు ధాటికి జవాన్ శరీరం ముక్కలుముక్కలైంది. లక్ష్మీకాంత్ స్వస్థలం మధ్యప్రదేశ్ రేవా జిల్లా  మందుపాతరల్ని గుర్తించేందుకు స్పెషల్ టీం రంగంలోకి దిగింది.