దేశంలో కొత్తగా 2,451 కోవిడ్ కేసులు

దేశంలో కొత్తగా 2,451 కోవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు, యాక్టివ్ కేసులు పెరిగాయి. కొత్తగా మరో 2 వేల 451 మందికి పాజిటివ్ గా తేలిదిం. వైరస్ వల్ల కొత్తగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి వెయ్యి 581 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 14 వేల 241కి పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రారోగ్య శాఖ. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 8 లక్షల 10 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయి. కొవిడ్ ధాటికి 3 వేల 289 మంది చనిపోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ కేసులు అధికంగా ఉన్నాయి.

మరిన్నివార్తల కోసం

 

కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

అనన్యా పాండే డబుల్  డ్యూటీ