- ఏ మాత్రం అవకాశం ఉన్నా మేడిగడ్డకు రిపేర్లు: ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మరో 4 రోజుల్లో సర్కారు చేతికి వస్తుందని నీటి పారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఆ నివేదికలోని అంశాల ఆధారంగానే మేడిగడ్డ విషయంలో ముందుకెళ్తామని తెలిపారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా రిపేర్లు చేసి, వచ్చే వానాకాలం నాటికి బ్యారేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు.
కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్తో గురువారం బీఆర్కే భవన్లో ఉత్తమ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ.. విచారణ తొలి రోజు కావడంతో ఘోష్ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కాళేశ్వరంపై నిజా నిజాలు వెలికితీసేందుకే జ్యుడీషియల్ కమిషన్ వేశామని తెలిపారు.