
హైదరాబాద్ సిటీ, వెలుగు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని హైదరాబాద్జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని సెంటర్లలో మొత్తం 43,676 మంది ఎగ్జామ్స్రాయాల్సి ఉండగా, మొదటి సెషన్కు 26,032 మంది హాజరయ్యారని, 17,644 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. రెండో సెషన్కు 25,787 మంది హాజరు కాగా, 17,889 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ చెప్పారు.